byసూర్య | Tue, Dec 05, 2023, 10:20 AM
హనుమకొండ జిల్లా కాజీపేట - వరంగల్ రైల్వేస్టేషన్ల మధ్య జరుగుతున్న మూడో లైను పనుల కారణంగా కాజీపేట-విజయవాడ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు మంగళవారం రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. భద్రాచలం రోడ్ నుంచి బల్లార్షా వెళ్లే సింగరేణి ఎక్స్ప్రెస్ ఈ నెల 6 నుంచి 8 వరకు, 10 నుంచి 19 వరకు హాసన్ పర్తి రోడ్ వరకు మాత్రమే నడుస్తుందని వివరించారు.