byసూర్య | Tue, Dec 05, 2023, 10:24 AM
ములుగు జిల్లా మంగపేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో ఒకరు మృతి చెందారు. మంగపేట మండలం చెరుపల్లి గ్రామానికి చెందిన ముత్తినేని మోహన్ రావు సోమవారం సాయంత్రం స్నానం చేయడానికి నీళ్ల బకెట్ లో వాటర్ హీటర్ పెట్టుకున్నారు. కాసేపటికి హీటర్ తీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా వారి కుటుంబీకులు తీవ్రంగా రోధిస్తున్నారు.