byసూర్య | Sat, Dec 02, 2023, 01:44 PM
మునుగోడు మండలంకి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త పసునూరి శంకరయ్య{డీలర్} శుక్రవారం రాత్రి మరణించారు. విషయం తెలుసుకున్న మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తక్షణమే స్పందించి శంకరయ్య కుటుంబానికి భరోసాగా 20వేల రూపాయలను కార్యకర్తల ద్వారా వారి కుటుంబ సభ్యులకు ఆర్ధిక సహాయాన్ని అందించడం జరిగింది. అనంతరం కార్యకర్తలు శంకరయ్య మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు