byసూర్య | Sat, Dec 02, 2023, 08:20 AM
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల పోలింగ్ నవంబర్ 30న ముగిసింది. ప్రస్తుతం బరిలో ఉన్న అభ్యర్థులు కార్యకర్తలు అంచనాలలో మునిగి తేలుతున్నారు. గ్రామాలు డివిజన్ల వారీగా పోలైన ఓటింగ్ శాతం ఆధారంగా లెక్కలు వేసుకుంటున్నారు. కూడిక తీసివేతలలో గెలుపోటములను బేరీజు వేస్తున్నారు. ఓ వైపు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నా, లోపల మాత్రం 3న వెలువడే ఎన్నికల ఫలితాలపై ఆశలు పెట్టుకున్నారు.