తిరుపతి వెళ్లేవారికి,,,,డిసెంబర్ ఆఖరివారం వరకు పొడిగింపు

byసూర్య | Fri, Dec 01, 2023, 11:47 PM

రైల్వే ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు గుడ్‌న్యూస్ చెప్పారు. తిరుపతి సహా పలు పట్టణాలకు నడుపుతున్న ప్రత్యేక ట్రైన్లను డిసెంబర్ ఆఖరివారం వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 10 ప్రత్యేక రైళ్లు నడుపుతుండగా.. వాటిని పొడిగిస్తున్నట్లు చెప్పారు. సికింద్రాబాద్‌-తిరుపతి (07482) ట్రైన్ డిసెంబరు 4-25వ తేదీ వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుందన్నారు. తిరుపతి-సికింద్రాబాద్‌ (07481) ట్రైన్ డిసెంబరు 3-31 వరకు ప్రతి ఆదివారం నడపనున్నట్లు చెప్పారు. ఇక హైదరాబాద్‌-నర్సాపూర్‌ (07631) స్పెషల్ ట్రైన్ డిసెంబరు 2-30 వరకు ప్రతి శనివారం అందుబాటులో ఉంటుందన్నారు. నర్సాపూర్‌-హైదరాబాద్‌ (07632) ట్రైన్ డిసెంబరు 3-31 వరకు ప్రతి ఆదివారం, కాకినాడ-లింగంపల్లి (07445) ట్రైన్ డిసెంబరు 1-29 వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో నడపనున్నట్లు చెప్పారు. లింగంపల్లి-కాకినాడ (07446) మధ్య నడిచే స్పెషల్ ట్రైన్ డిసెంబరు 2-30 తేదీ వరకు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటాయన్నారు. తిరుపతి-అకోలా, పూర్ణ-తిరుపతి మధ్య రెండు జతల ప్రత్యేక రైళ్లు నడుస్తాయని చెప్పారు.


Latest News
 

మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM
దేవరకద్ర: రేపు కురుమూర్తి దేవస్థాన పాలకమండలి ప్రమాణ స్వీకారం Fri, Oct 25, 2024, 08:03 PM
రేపు బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించనున్న వేముల Fri, Oct 25, 2024, 08:01 PM
ఇక ఆ రూట్‌లో ప్రయాణించేవారికి నో టెన్షన్ Fri, Oct 25, 2024, 08:00 PM