byసూర్య | Mon, Sep 25, 2023, 01:59 PM
ఖమ్మం జిల్లా, సత్తుపల్లి: పెనుబల్లి మండలంలో జ్వరాలు పంజా విసురుతున్నాయి. అనేక గ్రామాల్లో ప్రజలు జ్వరాల బారినపడి ఇబ్బందిపడుతున్నారు. రోగులకు పెనుబల్లి ప్రధాన ఆసుపత్రిలో బెడ్లు ఖాళీగా లేవంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పెనుబల్లి, వీ ఎంబంజర్, రామచంద్రరావు బంజర్, టేకులపల్లి, లింగగూడెం తదితర గ్రామాల్లో జ్వరాల తీవ్రత అధికంగా ఉంది. పెనుబల్లి ఆసుపత్రికి వచ్చే రోజువారి ఓపీలో వచ్చే 200 మందిలో 90మంది జ్వరపీడితులే ఉంటున్నారు