byసూర్య | Mon, Sep 25, 2023, 01:57 PM
ఇప్పటికే పెట్టుబడి ఖర్చులు పెరిగి నష్టాల పాలవుతున్న రైతులపై కాంప్లెక్స్ ఎరువుల భారం పడనుంది. 20-20-0-13 బిల్లింగ్ ధర రూ. 1, 159 ఉండగా అక్టోబరు 1వతేదీ నుంచి రూ. 1, 450కి పెరుగనుంది. 28-28-0, 14-35-14 మందు కట్టల గరిష్ఠ ధర కూడా రూ. 1. 600 నుంచి రూ. 1, 700 వరకు పెరగనుంది. ఒక్కో కాంప్లెక్సు ఎరువు బస్తామీద రూ. 100నుంచి రూ. 200 వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో ధరలు పెంచడం ఎంతవరకు సబబని రైతులు ప్రశ్నిస్తున్నారు.