byసూర్య | Mon, Sep 25, 2023, 01:56 PM
ఖమ్మం జిల్లాకు మంజూరైన పాలేరు జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఖమ్మంరూరల్ మండలం మద్దులపల్లిలోని ఐటీడీఏకు చెందిన వైటీసీ భవనంలో ఈ తరగతులు ప్రారంభం కానున్నాయని విద్యార్థులకు అధికారులు సమాచారం అందించారు. ఎంసెట్ కౌన్సెలింగ్ చివరి దశ సమయంలో ఈ కళాశాలకు అనుమతి రాగా, భవనం దొరక్కపోవడంతో ప్రారంభంలో జాప్యం జరిగింది. నేటి నుంచి తాత్కాలికంగా తరగతుల నిర్వహణకు అనుమతిచ్చారు.