byసూర్య | Mon, Sep 25, 2023, 01:54 PM
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసి మిర్చి ధర రూ. 24, 000 జెండాపాట పలకాగా, క్వింట పత్తి ధర రూ. 7050 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత రోజు కంటే ఈ రోజు ఏసి మిర్చి ధర స్థిరంగా ఉండగా, పత్తి ధర రూ. 50 తగ్గినట్లు వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్ కు వచ్చే రైతులు తప్పనిసరిగా నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.