byసూర్య | Sun, Sep 24, 2023, 11:22 AM
జిల్లాలో మాదక ద్రవ్యాల రవాణాను అరికట్టేందుకకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ గౌతమ్ పేర్కొన్నారు. ఖమ్మం కలెక్టరేట్ లో జరిగిన జిల్లా స్థాయి నార్కోటిక్స్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో సీపీతో కలిసి ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాల సరఫరా మూలాలను గుర్తిస్తే అరికట్టడం సులువవుతుందని చెప్పారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా కట్టడి చేయాలని, లేనిపక్షంలో సమాజంపై దుష్ప్రభావాన్ని చూపుతుందన్నారు.