byసూర్య | Sat, Sep 23, 2023, 02:58 PM
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు పదవులు ముఖ్యం కాదని.. కార్యకర్తలే ముఖ్యమని స్పష్టం చేశారు. అవసరమైతే కార్యకర్తల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని మైనంపల్లి వెల్లడించారు. తమ కోసం బయటకు వచ్చిన కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు.