byసూర్య | Sat, Sep 23, 2023, 03:28 PM
శనివారం మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలో మండలాన్ని వికారాబాద్ జిల్లాలో విలీనం చేయడానికి చేస్తున్న దీక్ష 5వ రోజుకు చేరింది. ఈ దీక్షలో భాగంగా మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి చెందిన సందర్భంగా వారి ఆత్మకు శాంతి కలగాలని సంతాపం తెలిపారు. వారు ఎమ్మెల్యేగా విధులు నిర్వహించేటప్పుడు మండలాన్ని వికారాబాద్ జిల్లాలో ఉండే విధంగా ప్రయత్నించారని వి జేఏసీ నాయకులు అన్నారు.