byసూర్య | Sat, Sep 23, 2023, 01:58 PM
ఈనెల 30వ తేదీన మంత్రి కేటీఆర్ భద్రాచలం పట్టణంలో పర్యటించనున్న నేపథ్యంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఏర్పాట్లను పరిశీలించారు. కేటీఆర్ పర్యటన ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు తెల్లం వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.