byసూర్య | Sat, Sep 23, 2023, 01:34 PM
సింగరేణి అవినీతిపై బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణి పరిధిలోని బొగ్గు బ్లాక్ల వేలంలో సింగరేణి యాజమాన్యం పాల్గొనకుండా అడ్డుకున్నారంటూ సీఎం కేసీఆర్పై ఆరోపణలు చేశారు. కోయగూడెం బ్లాక్ గనుల కేటాయింపుల్లో కేసీఆర్ లబ్ది పొందారని, దీన్ని రబిందో శరత్ చంద్రారెడ్డికి కట్టబెట్టారని వ్యాఖ్యానించారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని పేర్కొన్నారు.