byసూర్య | Fri, Sep 22, 2023, 01:11 PM
హైదరాబాద్ లో దొంగ ముఠాలు కన్నేశాయి. పోలీసుల బదిలీలు , ఎన్నికల సన్నద్ధత , వినాయకచవితి సందడిలో అంతా బీజీ అయ్యారు. అదునుగా భావించిన ముఠాలు రెచ్చిపోతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల వియాపూర్లో చెడ్డీగ్యాంగ్ హల్చల్ చేసింది. అల్వాల్ , బొల్లారంలో చోరీలు చేసిన పార్టీ గ్యాంగ్ సభ్యుడు దొరికిపోయాడు. ఇక శివారు మేడిపల్లిలోనూ మహారాష్ట్ర థార్ గ్యాంగ్ కదలికలు బయటపడ్డాయి. అనుమానాస్పద వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి.