byసూర్య | Fri, Sep 22, 2023, 01:09 PM
ఢిల్లీలో తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ భేటీ అయింది. ఈ రోజు పూర్తి జాబితాను ఖరారు చేసి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదం కోసం సిఫార్సు చేయనుంది. నిన్నటి సమావేశంలో సుమారు 60 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులపై ఏకాభిప్రాయం రాగా.. మరో 30 అసెంబ్లీ స్ఖానాల్లో ఇద్దరి అభ్యర్ధుల పేర్లు ఖరారు చేశారు. ఇంకో 30 అసెంబ్లీ స్థానాల్లో ముగ్గురు అభ్యర్థుల పేర్లు ఖరారు చేశారు. ఈ రోజు మరింత వడపోత ప్రక్రియతో, అభ్యర్ధుల జాబితాను తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ కుదించనుంది.