byసూర్య | Fri, Sep 22, 2023, 11:27 AM
మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని మన్సన్ పల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొని జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, దయనంద్ గుప్తా, యెగ్గే మల్లేశం, కలెక్టర్ హరీష్ తో కలిసి గురువారం లక్కీ డ్రా ద్వారా డబుల్ బెడ్ రూమ్ లు పొందిన వారికి సంబంధిత పత్రాలు, తాళాలు మంత్రి అందజేశారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మొదటి విడత డ్రాలో వచ్చిన 500 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పత్రాలను గురువారం ప్రభుత్వ విప్ గాంధీ పంపిణి చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారిగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు, పలువురు ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు.