byసూర్య | Fri, Sep 22, 2023, 11:08 AM
రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజక వర్గం గచ్చిబౌలి, మాదాపూర్ తదితర ప్రాంతాలలో గురువారం రాత్రి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసినట్లు స్థానికులు తెలిపారు. ఈ అకాల వర్షం కారణంగా వాహనదారుల రాకపోవకులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. భారీవర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనట్లు తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే చొరవ తీసుకుని సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరారు.