byసూర్య | Fri, Sep 22, 2023, 10:52 AM
తెలంగాణలో సింగరేణిలో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతేడాది నిర్వహించిన పరీక్షలో మార్కుల ఆధారంగా అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేయాలని తీర్పునిచ్చింది. ఇటీవల పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం పక్కనబెట్టింది. కాగా. ఈ పరీక్షకు 77,907 మంది హాజరుకాగా.. వీరిలో 49,328 మంది అభ్యర్థులు కనీస మార్కులు సాధించారు.