byసూర్య | Thu, Sep 21, 2023, 04:08 PM
తెలంగాణలోని సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు యాజమాన్యం శుభవార్త తెలిపింది. 11వ వేజ్ బోర్డు అరియర్స్ కింద 39,413 మందికి రూ.1,450 కోట్లను విడుదల చేసింది. నేటి నుంచే కార్మికుల బ్యాంకు అకౌంట్ లలో డబ్బు జమ చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఒక్కొక్కరికి సగటున దాదాపు రూ.3.70 లక్షలు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. త్వరలోనే దసరా, దీపావళి బోనస్ చెల్లింపులకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.