byసూర్య | Thu, Sep 21, 2023, 03:48 PM
గురుకుల పరీక్షలు రాసిన అభ్యర్థుల నుంచి సొసైటీ ప్రిఫరెన్స్ ఆప్షన్లను గురుకుల బోర్డు స్వీకరించనుంది. పనిచేయదలచుకున్న సొసైటీల వివరాలను అభ్యర్థులు తమ ప్రాధాన్యం మేరకు వరుసగా ఆప్షన్లు ఇవ్వాలని బోర్డు సూచించింది. ఈమేరకు బుధవారం గురుకుల అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. టీజీటీ అభ్యర్థుల నుంచి ఈ నెల 21 నుంచి 30 వరకు ఆప్షన్లను స్వీకరించనున్నారు. లైబ్రేరియన్, పీడీ, డ్రాయింగ్, మ్యూజిక్, క్రాఫ్ట్ టీచర్ పోస్టుల అభ్యర్థులు అక్టోబరు 3 నుంచి 9 వరకు ఆప్షన్లను ఇవ్వాలని సూచించారు. ఒకసారి సొసైటీ ప్రిఫరెన్స్ ఆప్షన్లు ఇచ్చాక తదుపరి ఎడిట్ ఆప్షన్ ఉండదని అధికారులు తెలిపారు.