byసూర్య | Thu, Sep 21, 2023, 03:47 PM
హైదరాబాద్ , ఖైరతాబాద్ గణపతిని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడారు. కుటుంబ సమేతంగా వచ్చి.. బడా గణేష్ని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. శాసన సభ్యులుగా ఉన్నప్పటి నుంచి గణేష్ని దర్శించుకుంటున్నా. ప్రజలు అందరు సుఖంగా సంతోషంగా ఉండాలి అని గణపతిని ప్రార్థించా. ప్రతి ఒక్కరికి దైవ భక్తి వల్ల సంతృప్తి కలుగుతుంది. దేశంలో సమైక్యత, గురుభావం, దైవ భక్తి పెరుగుతుంది. ఇలానే దేశం ముందుకు వెళ్లాలని కోరుకొంటున్నా.’’ అని వెంకయ్య తెలిపారు.