byసూర్య | Thu, Sep 21, 2023, 03:47 PM
కేంద్రం ప్రవేశపెట్టిన మహిళ బిల్లు మంచిదే కానీ.. బిల్లులో పెట్టిన ప్రొవిజన్స్ సరిగ్గా లేవని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అభిప్రాయం వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్ సీపీఎం కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి అభిమానముంటే మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలన్నారు. అక్టోబర్ 1న కమ్యూనిస్టులు పోటీచేసే అసెంబ్లీ స్థానాలను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఇండియా కూటమిని కాదని పరోక్షంగా బీజేపీకి కేసీఆర్ సపోర్ట్ చేస్తున్నారని విమర్శించారు. బీజేపీకీ వ్యతిరేకంగా కమ్యూనిస్టులుగా పోరాటం చేస్తామని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు.