byసూర్య | Thu, Sep 21, 2023, 02:30 PM
నిరుపేద ప్రజలకు సీఎం కేసీఆర్ అన్నివిధాలా అండగా ఉంటారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం ఉప్పల్ నియోజకవర్గంలోని చర్లపల్లి డివిజన్ లో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ళను ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి తో కలిసి ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్ రూం ఇళ్ళను పంపిణీ చేస్తామని అన్నారు.