byసూర్య | Thu, Sep 21, 2023, 11:52 AM
సత్తుపల్లి మండలం గంగారం 15వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్ ను అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా బుధవారం సందర్శించారు. బెటాలియన్లో నూతనంగా నిర్మించిన మిషన్ భగీరథ వాటర్ సంపు, ఏకలవ్య వెల్ఫేర్ కాంప్లెక్స్ ఆఫీసు, ద్విచక్ర వాహనాల పార్కింగ్ షెడ్, మినీ గెస్ట్ హౌస్, నర్సరీలను ఆమె ప్రారంభించారు. బెటాలియన్ లోని బీటీసీ ట్రైనింగ్ సెంటర్, బెటాలియన్ మైన్ ఆఫీసు, ఫైరింగ్ రేంజ్ లను పరిశీలించారు.