byసూర్య | Thu, Sep 21, 2023, 11:49 AM
మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలో ఆమోదం పొందడంపై ట్విట్టర్(ఎక్స్) వేదికగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ హర్షం వ్యక్తం చేశారు. ‘‘దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న బిల్లును ప్రధాని మోదీ విజయవంతంగా ఆమోదింపజేశారు. రాజకీయ వారసులు, రాజవంశీకుల మొసలి కన్నీరు.. ప్రధాని చొరవ ముందు అదృశ్యమయ్యాయి. ప్రధానికి యావత్ భారతమంతా కృతజ్ఞత తెలుపుతోంది’’ అని ట్వీట్ చేశారు.