byసూర్య | Thu, Sep 21, 2023, 11:48 AM
కొండ లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివని పద్మశాలి సంఘం జన్నారం మండల నాయకులు అన్నారు. లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకొని గురువారం జన్నారం మండల కేంద్రంలో ఆ సంఘం నాయకులు కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసే నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జన్నారం మండల నాయకులు, సభ్యులు, కులస్తులు పాల్గొన్నారు.