byసూర్య | Thu, Sep 21, 2023, 11:45 AM
రఘునాథపాలెం మండలంలోని 37 గ్రామ పంచాయతీల పరిధిలో 40 గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో హైమాస్ట్ లైట్లు వెలుగులు అందించబోతున్నాయి. సుడా నిధుల నుంచి మొత్తంగా రూ. 1. 40 కోట్ల నిధులు మంజూరు చేసి లైట్లు ఏర్పాటు చేయగా, గురువారం రాంక్యాతండాతో పాటు మరో ఐదు గ్రామాల్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లోని లైట్లను సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ ప్రారంభించారు.