byసూర్య | Thu, Sep 21, 2023, 11:44 AM
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10. 30 గంటలకు నగరంలోని 19వ డివిజన్ లో, 10. 45 గంటలకు 16వ డివిజన్లో, 11 గంటలకు 14వ డివిజన్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం 4గంటలకు రఘునాథపాలెం మండలం హర్యాతండా, 4. 35 గంటలకు పుఠానితండా, 4. 50 గంటలకు సూర్యాతండా, 5. 05 గంటలకు వాంకుడోత్ తండా, 5. 20 గంటలకు రాంక్యాతండాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.