byసూర్య | Thu, Sep 21, 2023, 11:52 AM
సమాజ సేవ చేస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. అంగన్ వాడీల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని, సమ్మె విచ్చిన్నానికి కుట్ర పన్నుతోందని ఆరోపించారు. బుధవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించిన అంగన్ వాడిలకు సీపీఐ, సీపీఎం నేతలు మద్దతు పలికారు.