byసూర్య | Thu, Sep 21, 2023, 10:50 AM
మహేశ్వరం మండల పరిధిలోని మన్సాన్ పల్లి గ్రామం సర్వే నెంబర్ 140లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను డ్రాలో ఎంపికైన లబ్ధిదారులకు ఇంటి పత్రాలను పంపిణీ చేయడానికి గురువారం ఉదయం 11 గంటలకు మంత్రి సబితారెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డిలు హాజరవుతున్నారని తహసీల్దార్ మహమూద్ అలీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజా ప్రతిని ధులు, అధికారులు విజయవంతం చేయాలని కోరారు.