byసూర్య | Thu, Sep 21, 2023, 10:49 AM
నాగర్ కర్నూల జిల్లా వంగూరు మండలం పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన అనారోగ్య బాధితులకు అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, భారత రాష్ట్ర సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గువ్వల బాలరాజు బుధవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని అన్నారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.