byసూర్య | Thu, Sep 21, 2023, 10:49 AM
తెలంగాణలో టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్ పడింది. మల్టీజోన్-2 బదిలీలు, పదోన్నతులపై హైకోర్టు స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ జోన్ పరిధిలోని 13 జిల్లాల్లో బదిలీలు నిలిచిపోయాయి. సీనియార్టీ జాబితాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు టీచర్లు హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు స్టే ఇచ్చింది. అయితే, మల్టీజోన్-1 బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ యదాతథంగా కొనసాగుతాయి.