byసూర్య | Thu, Sep 21, 2023, 10:48 AM
కల్వకుర్తి పట్టణం హనుమాన్ నగర్ కాలనీ కి చెందిన మల్లేష్ (42) బుధవారం సాయంత్రం ఒంటి పై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎస్. ఐ రమేష్ కథనం మేరకు భార్య వద్ద ఉన్న బంగారు గొలుసు ఇవ్వాలని మల్లేష్ అడగ్గా ఆమె నిరాకరించడంతో ఇంటి ఆరు బయట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అతని గమనించిన స్థానికులు మంటలు ఆర్పి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.