byసూర్య | Thu, Sep 21, 2023, 10:50 AM
ఐటీ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ గురువారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ లోని లబ్దిదారులకు రెండో విడత డబుల్ బెడ్ రూం ఇళ్ళను పంపిణీ చేయనున్నారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం శామీర్ పేట్ జీనోమ్ వ్యాలీ లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.