byసూర్య | Thu, Sep 21, 2023, 11:16 AM
తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటోందని, వారి సంక్షేమానికి చిత్తశుద్ధితో పని చేస్తోందని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. బుధవారం జల్ పల్లిలో జరిగిన కార్యక్రమంలో ఆర్కేపురం డివిజన్ కు చెందిన దివ్యాంగ లబ్ధిదారులకు బ్యాటరీ ట్రై సైకిళ్లను మంత్రి అంద జేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వంలో అన్ని వర్గాల వారు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు.