byసూర్య | Thu, Sep 21, 2023, 11:29 AM
పాల్వంచ పట్టణంలోని కరకవాగుకు చెందిన పిల్లి రవిశంకర్ పాలవ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అప్పుల బాధ తాళలేక మంగళవారం సాయంత్రం తన గేదెల షెడ్డులో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతరం గుర్తించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బుధవారం మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చేసినట్లు పోలీసులు తెలిపారు.