byసూర్య | Thu, Sep 21, 2023, 11:31 AM
నేడు కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గురువారం ఉదయం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ళను ప్రారంభించనున్నారు. అనంతరం మేడ్చల్ లోని శామీర్ పేట్ తుర్కపల్లి జీనోమ్ వ్యాలీ లో మంత్రి కేటీఆర్ తో కలిసి మంత్రి మల్లారెడ్డి పర్యటిస్తారు. అనంతరం కళ్యాణ లక్ష్మి చెక్కులను శామీర్ పేట్ లో పంపిణీ చేయనున్నారు.