byసూర్య | Thu, Sep 21, 2023, 11:41 AM
జగిత్యాల రూరల్ మండలం ధర్మారం గ్రామానికి చెందిన కురుమ సంఘం కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను ఎమ్మెల్యే క్వార్టర్లో గురువారం కలిశారు. గ్రామంలోని బీరయ్య ఆలయంలో బోరు మోటర్, ప్రహరీ గోడకు నిధులు మంజూరు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే 2. 5 లక్షల నిధులు సత్వరమే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. వారి వెంట ఎంపీపీ రాజేంద్రప్రసాద్, నాయకులు దనేశ్వరరావు ఉన్నారు