byసూర్య | Thu, Sep 21, 2023, 11:42 AM
ఇరువు ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కిన్నెరసాని నిండుకుండలా మారింది. 407 అడుగుల నీటి నిల్వ సామర్ధ్యం కలిగిన కిన్నెరసాని రిజర్వాయర్ కి ఎగువ నుంచి 500 క్యూసెక్కుల వస్తుండగా, బుధవారం నీటిమట్టం 405. 80 అడుగులకు పెరిగింది. దీంతో ప్రాజెక్టుకు చెందిన ఒక గేటు ఎత్తి ఉంచి 5 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తునట్లు ప్రాజెక్టు ఏఈ సురేష్ తెలిపారు.