byసూర్య | Wed, Jun 07, 2023, 01:13 PM
బొంరస్ పేట మండల పరిధిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు భారీగా వరి ధాన్యం తరలిరావడంతో ధాన్యంను రైస్ మిల్లులకు తరలించేందుకు లారీల కొరత ఏర్పడింది. దీంతో హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై, ఆర్టిఏ, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో సంయుక్తంగా రోడ్డుపై నిలబడి లారీలను కొనుగోలు కేంద్రాలకు తరలించారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ శంకర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు నాలుగు లారీలను సమకూర్చారు.