byసూర్య | Wed, Jun 07, 2023, 01:13 PM
కొడంగల్ నియోజకవర్గం కొత్తపల్లి మండలంలోని నిడ్జింత గ్రామంలో మంగళవారం పోచమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా గ్రామ దేవతకు బోనాల పండుగ నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. భక్తులు అమ్మవారికి కోడిపుంజులతో, మేకపోతులతో నైవేద్యం సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లావణ్య రాజశేఖర్ రెడ్డి, ఎంపీటీసీ, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.