ఆ స్థానాలకు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు,,,ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించిన హైకోర్టు

byసూర్య | Sat, Mar 25, 2023, 07:31 PM

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనేది చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పూర్తి వివరాలతో ఓ సమగ్రమైన నివేదిక సమర్పించాలని హైకోర్టు కోరింది. రాష్ట్రంలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల పోస్టులు మూడేళ్లుగా ఖాళీగా ఉన్నాయి. వీటికి ఎన్నికల సంఘం ఇప్పటివరకు ఎన్నికలు నిర్వహించి భర్తీ చేయలేదు. దీంతో ఈ విషయంపై ప్రముఖ న్యాయవాది రాపోలు భాష్కర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.


ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు ఇప్పటివరకు ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించింది. దీనిపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఎన్నికల సంఘానికి నోటీసులిచ్చింది. రాష్ట్రంలో 94 ఎంపీటీసీ, 5362 వార్డు సభ్యులు, 220 సర్పంచ్, 3 జడ్పీటీసీ, 344 ఉపసర్పంచ్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఖర్చులకు సంబంధించిన అఫిడవిట్‌ను దాఖలు చేయకపోవడంతో కొంతమందిపై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. ఇక అవిశ్వాస తీర్మానాల వల్ల మరికొంతమంది తమ పదవులకు రాజీనామాలు చేయగా.. వివిధ కారణాలతో పలువురు రాజీనామా చేశారు.


ఖాళీ అయి దాదాపు మూడేళ్లు అవుతున్నా ఎన్నికలపై అధికారులు దృష్టి పెట్టలేదు. దీని వల్ల గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయని రాపోలు భాస్కర్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే తొలుత స్థానికంగా ఉండే సర్పంచ్, ఎంపీటీసీలకు చెప్పుకుంటారు. అలాగే గ్రామంలోని సమస్యలు స్థానికంగా ఉండే సర్పంచ్, ఎంపీటీసీలకు వెంటనే తెలుస్తాయి. చాలా స్థానాలు ఖాళీగా ఉండటం వల్ల ప్రజలు తమ సమస్యలు ఎవరికీ చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.


చాలా గ్రామాల్లో మూడేళ్లుగా అభివృద్ది పనులు పూర్తిగా కుంటుపడిపోయాయి. ప్రజలకు ఓ ప్రతినిధి లేకుండా పోయాడు. దీంతో ఖాళీగా ఉన్న స్థానాలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరుగుతోంది. ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘానికి వెంటనే ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. స్థానిక ప్రతినిధులు లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘానికి నోటీసులివ్వగా.. తదుపరి విచారణ ఏప్రిల్ 27కు వాయిదా పడింది. తదుపరి విచారణలో హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనేది చూడాలి.


 


Latest News
 

దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ రోజుకో తేదీ అంటున్నారు : కేటీఆర్ Sat, May 04, 2024, 09:48 PM
శ్రీరామనవమి వేడుకలు.. భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం ఎన్ని కోట్లో తెలుసా Sat, May 04, 2024, 08:55 PM
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ ఛార్జీలు మినహాయింపు Sat, May 04, 2024, 08:50 PM
కాంగ్రెస్‌కు ఓటేస్తే నన్ను చంపినట్టే.. మోత్కుపల్లి భావోద్వేగం, అందరిముందే కన్నీళ్లు Sat, May 04, 2024, 08:43 PM
భగ్గుమంటున్న భానుడు.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వడదెబ్బతో ఆరుగురు మృతి Sat, May 04, 2024, 08:38 PM