byసూర్య | Fri, Mar 24, 2023, 10:07 PM
తమ అవినీతి, వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రాహుల్ గాంధీపై వేటు వేశారని బీజేపీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటును ఆమె ఖండించారు. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై పైకోర్టుకు వెళ్లే అవకాశం ఉందని తెలిసే రాహుల్ గాంధీపై హడావుడిగా వేటు వేశారని కవిత ఆరోపించారు. తమ అవినీతి, వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు మోదీ చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే రాహుల్ గాంధీపై వేటు వేశారని ఆక్షేపించారు.