byసూర్య | Mon, May 06, 2024, 03:58 PM
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామానుజాపూర్ గ్రామంలో విద్యుత్ షాక్ తో గుర్రాల రమేష్ రెడ్డికి చెందిన ఆవు దూడ మృతి చెందిందని సోమవారం బాధితులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాన్స్ఫార్మర్ గద్దె కిందికి ఉండడం వల్ల మేత కోసం వెళ్ళిన ఆవు దూడకు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ రావడంతో ఆవు దూడ అక్కడికక్కడే మృతి చెందిందని తెలిపారు. దీంతో బాధితుడికి సుమారు 80 వేలు నష్టమని పేర్కొన్నారు.