byసూర్య | Fri, Mar 24, 2023, 10:07 PM
కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. రాహుల్ గాంధీపై అనర్హత వేయడంపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం మోదీ సర్కార్ నియంతృత్వ పాలనకు, అహంకార ధోరణికి నిదర్శనమంటూ ట్వీట్ చేశారు. రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామ్యం పెను ప్రమాదంలో ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు.