byసూర్య | Mon, May 06, 2024, 03:44 PM
గత ప్రభుత్వంలో నిజాంసాగర్ మండలంలో దళిత బంధు పేరుతో స్థానిక బిఆర్ఎస్ నాయకులు దోచుకుతిన్నారని ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థికి మద్దతుగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, మండల అధ్యక్షుడు మల్లికార్జున్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.