byసూర్య | Mon, May 06, 2024, 03:42 PM
జుక్కల్ సెగ్మెంట్ నిజాంసాగర్ మండలం నర్సింగరావు పల్లి గ్రామంలో బిచ్కుంద మండలం అంతాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం 200 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్యెల్యే కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.