byసూర్య | Mon, May 06, 2024, 03:38 PM
కామారెడ్డి పట్టణంలోని 14వ వార్డు, 37వ వార్డులో జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ కి గెలుపు కోసం సోమవారం విస్తృత స్థాయి ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి, కౌన్సిలర్ పాత శివ కృష్ణమూర్తి, 14వ వార్డు ఇంచార్జ్ మేత్రి శంకర్, బండారు రమేష్, యూత్ నాయకులు రాహుల్, రాకేష్, శీను, సైమన్, నర్సింలు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.