byసూర్య | Fri, Mar 24, 2023, 10:08 PM
రాహుల్ గాంధీపై అనర్హత వేటును మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ట్విటర్ వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. రాజ్యాంగాన్ని పూర్తిగా వక్రీకరించే విధంగా ఉందంటూ దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ విషయంలో బీజేపీ తొందరపాటుగా వ్యవహరించిందని అభిప్రాయపడ్డారు. తన ట్వీట్తో పాటు ప్రముఖ రచయితల కొటేషన్స్ని కూడా జతపరిచారు కేటీఆర్.